ఏటీఎంలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి గంట వ్యవధిలో డబ్బులు రికవరీ చేసి అందించిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్

పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీహార్ వ్యక్తి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- గద్వాల పట్టణ కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్ ఖాని ఏటీఎం మిషన్లో 8000 జమ చేసి వెళ్లాడు. కానీ ఏటీఎం మిషన్ లో వేసిన అమౌంట్ రిటర్న్ వచ్చిన సంగతి చూసుకోలేదు బీహార్ కు చెందిన వ్యక్తి. ఆ డబ్బులు అతను ఖాతాలో పడకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. స్పందించిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ ఏటీఎం సీసీ కెమెరా మరియు గద్వాల పట్టణ కేంద్రాలలో అమర్చినటువంటి ఏటీఎం ముందు ఉన్న సీసీ కెమెరాల ద్వారా అసలు విషయాన్ని కనుగొన్నాడు. బీహార్ కు చెందిన వ్యక్తి 8000 వేలు డబ్బులు ఏటీఎం మిషన్ లో వేసి వెళ్ళాడు కానీ అవి ఏటీఎం మిషన్ లో జమ కాకపోవడం, వెనకాల ఉన్న వ్యక్తి అట్టి డబ్బులు తీసుకెళ్లడం ఇదంతా సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ గంట వ్యవధిలో డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి 8000 రూపాయలను బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్ ఖానీ కు ఎస్సై అందించడం జరిగింది. పోగొట్టుకున్న డబ్బును అందించినందుకు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు బీహార్ వ్యక్తి. అంతేకాకుండా సమస్య తెలిసిన వెంటనే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏటీఎం సీసీ కెమెరా, ఏటీఎం ముందు ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి రికవరీ చేసినందుకు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ కు పలువురు మరియు వారి సిబ్బంది చందు, కిరణ్ కుమార్ అభినందనలు తెలియజేస్తున్నారు

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..