భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి – వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నిర్వహించిన రైతుల సమావేశంలో రైతుల తరఫున మాట్లాడడం జరిగిందన్నారు. రైతులకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కు కోరడం జరిగిందని తెలిపారు.రైతుల తరఫున వారి యొక్క సమస్యలు కొన్ని సూచనలను సబ్ కలెక్టర్ కు విన్నవించడం జరిగింది అన్నారు.ఈ ప్రాజెక్టు లో వడ్డేపల్లి గ్రామంలతో పాటు ఐదు గ్రామాలకు ప్రతిపాదిం చిన పైపులైన్ సంబంధించి 2593 ఎకరాలకు చెరువులను నింపే ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని దానికి సంబంధించిన పనులను తొందరగా ప్రారంభించాలని కోరుతూ ప్రాజెక్టు మొదటి విడతలో 14,000 ఎకరాలకు నీరందించే పైప్ లైన్,ప్రాజెక్ట్ నుండి దాదాపు 9 కిలో మీటర్ పరిధిలో ఉన్న రైతులందరికీ ఒకేసారి భూ సేకరణ చేయాలని,భూమి కోల్పోయిన రైతులకు గతంలో ఈ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి పరిహారం 17 లక్షలు ఇచ్చారని, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఆ యొక్క పరిహారం సరిపోదని ఎకరానికి 30 లక్షల పరిహారం చెల్లించాలని రైతులందరికీ న్యాయం చేసే విధంగా చూడాలని సబ్ కలెక్టర్ కు కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, హనుమంత్ రెడ్డి,మచ్చా రవీందర్,సాయిలు,ప్రజా పండరి,ప్రదీప్,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..