ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..

మన న్యూస్ ఐరాల జులై-18

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కామినాయనిపల్లె దళితవాడలో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును, కస్తూరినాయనిపల్లెలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డును, కుల్లంపల్లె మరియు కుల్లంపల్లె దళితవాడల్లో కలిపి రూ.6 లక్షల విలువైన సీసీ రోడ్లను, కామినాయనిపల్లెలో మరో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును, అలాగే వైయస్ గేటు నుండి పుత్రమద్ది వయా కామినాయనిపల్లె వరకు రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన బిటుమిన్ (బీటీ) రోడ్డును మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మౌళిక వసతులు చేరవేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కో- ఆర్డినేటర్ గిరిధర్ బాబు, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, నాయకులు మేదర్లమిట్ట మోహన్ నాయుడు, దేవాజీ, చంద్రశేఖర్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గోన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ