విలీనం పేరుతో బడిని మూసివేసిన ప్రభుత్వం-చదువుకు దూరమై భిక్షాటన వైపు గిరిజన చిన్నారులు

పంచాయతీ కేంద్రానికి మూడు కిలోమీటర్లు దూరంలో పాఠశాల ఏర్పాటు-బడి విలీన ప్రక్రియను విరమించుకోవాలి- రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు

గూడూరు, మన న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం బడుల విలీన ప్రక్రియ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు పంచాయతీ కేంద్రంలో ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమర వారి పాలెం లో ఏర్పాటు చేయడంతో గిరిజన విద్యార్థులు పాఠశాలల వెళ్లకుండా చదువుకు దూరమై గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఆలయం లో భిక్షాటన చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందరికీ విద్య కల్పించే విధంగా ఒక వైపు నిర్ణయం తీసుకుంటూ మరోవైపు బడుల విలీన ప్రక్రియ పేరుతో దళితులు గిరిజనులకు చదువుకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా గిరిజన కుటుంబాలు తమ బిడ్డలను చదివించుకోవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పంచాయతీ కేంద్రంలో ఉన్న పాఠశాలను ఎత్తివేసి ఆ పంచాయతీ పరిధిలోని మూడు కిలోమీటర్ల ఉన్న కొమర వారి పాలెం లో ఏర్పాటు చేయడం భావ్యంగా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కేంద్రమైన తూర్పు కనుమూరు గ్రామంలో ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను కొనసాగించాలని ఆయన కోరారు. పాఠశాలను తూర్పు కనుమూరులో తిరిగి ఏర్పాటు చేయకపోతే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..