కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పవిత్ర మాలలు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కు బహుకరణ

కాణిపాకం నవంబర్ 27 మన న్యూస్

కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి పవిత్ర మాలలను *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* కాణిపాకం ఆలయ అధికారులు బహుకరించారు. బుధవారం ఉదయం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో కాణిపాకం దేవస్ధానం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ ఈవో గురుప్రసాద్ స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. ఇటీవల్ల కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాల్లో స్వామి వారి చెంత ఉంచి‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన పవిత్ర మాలలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కి బహుకరించారు. తర్వాత స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిపై తన భక్తి‌భావం వ్యక్తం చేస్తూ, ఈ దివ్య అవకాశం దక్కించినందుకు దేవస్థానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్ధానం ఈవో గురుప్రసాద్, ఐరాల మండల అధ్యక్షులు గిరిధర్ బాబు, కాణిపాకం ఆలయ మాజీ ఛైర్మన్ మణినాయుడు, చిత్తూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు మరియు కాణిపాకం దేవస్ధానం వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గోన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///