అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

ఉరవకొండ మన న్యూస్:అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ అని సీపీఎం నాయకులు విరుపాక్షి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు.
వజ్రకరూరు మండల కేంద్రంలో బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తి సమ్మె ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ దగ్గర నుండి గాంధీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ అవార్డు గ్రహీత ఎంపీ మల్లికార్జున ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
.రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విరుపాక్షి మాట్లాడుతూ… ఈ పాపాలన్నిటికీ ప్రధాన బాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రధానమంత్రి మోడీదే. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలకు పూనుకున్నది నిబంధనలు మార్చేసింది దేశంలోని ప్రతి వినియోదారుడికి స్మార్ట్ మీటర్లు బిగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. విద్యుత్ రంగం మొత్తాన్ని ప్రైవేటు సంస్థలకు ద్వారా దత్తం చేయాలని ముఖం జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అప్పులు ఎర్ర చూపించి లొంగదీసుకున్నది గత వైసిపి ప్రభుత్వం గుడ్డిగా సంతకాలు పెట్టింది వాటిని మార్చుతామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అదే దారిలో నడుస్తుందని, గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని చెప్పిన తెలుగుదేశం నేతలు నేడు మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వడం మోసపూరితం అని అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. పాత కార్మిక చట్టాలు కొనసాగించాలి. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి. పని గంటలు పెంచడం కాదు కనీస వేతనాలు పెంచాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, అప్కాస్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సురేష్, సిఐటియు అంజి, కసాపురం రమేష్, అంగన్వాడి కార్యకర్తలు సువర్ణమ్మ , హెలిన రాణి, నాగమణి, జానకి, మధ్యాహ్న భోజనం కార్మికులు రంగమ్మ, చాబాల సుధాకర్, హమాలీ కార్మికులు కమలపాడు పెద్దన్న, వెంకటేష్, షేక్షావలి, చంద్రశేఖర్, మా భాష, సత్యసాయి కార్మికులు లాలు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు