ఘనంగా ఏబీవీపీ 77 వ ఆవిర్భావ వేడుకలు. పాల్గొన్న ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున.

గూడూరు, మన న్యూస్ : స్థానిక ఒకటవ పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని నిరంతరం విద్యార్థుల కోసం పనిచేస్తూ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తుంది అన్నారు. భగత్ సింగ్ వివేకానంద చంద్రశేఖర్ ఆజా ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వ్యక్తిత్వాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతుంది అన్నారు. పూర్వ రాష్ట్ర కార్యదర్శి మన్నూరు మల్లికార్జున మాట్లాడుతూ వివేకానందుని మాట ఏబీవీపీ బాట అని భరతమాతను విశ్వ గురువు చేయడం కోసం విద్యార్థి పరిషత్ గత 77 సంవత్సరాలుగా విద్యార్థులలో పని చేస్తుంది అన్నారు. కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా విద్యార్థులలో జాతీయ భావాలు పెంపొందించి తద్వారా సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం విద్యార్థి పరిషత్ చేస్తుంది అన్నారు. దేశ్ కి రక్ష కౌన్ కరేగా కవున్ కరేగా హం కరేగా, భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ గారు పూర్వ కార్యకర్తలు మనోహర్ శివశంకర్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..