ఎన్నికల హామీలపై బాబు పవన్ లను నిలదీయాలిశాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స

గొల్లప్రోలు జూలై 9 మన న్యూస్ :– ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అమలు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ప్రజలు నిలదీయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసిపి రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు లోని సత్య కృష్ణ ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ వైసిపి సర్వ సభ్య సమావేశానికి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణ విచ్చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు, పవన్ లు సంతకాలు చేసి ప్రజలకు బాండ్లు పంపిణీ చేశారని ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంతవరకు సూపర్ సిక్స్ లోని హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత తనదేనని పవన్ కళ్యాణ్ ప్రకటించినా నోరు మెదపడం లేదని విమర్శించారు. అధికార పార్టీ హామీల పేరుతో చేసిన మోసాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమకు ఉందన్నారు. త్వరలోనే పట్టణాలు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి చంద్రబాబు హామీల మోసాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి ఏడాది రైతులకు 20వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఇవ్వకుండా మోసం చేశారని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలో సొమ్ములు జమ చేస్తామని ప్రకటించి రెండు నెలలు గడుస్తున్నా సొమ్ములు చెల్లించలేదన్నారు. నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి అమలు చేయకుండా మహిళలను మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. గిట్టుబాటు ధర లేక మామిడి, మిర్చి,పొగాకు రైతులు రోడ్డు ఎక్కారన్నారు. వైసిపి నాయకులు,కార్యకర్తలు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. మాజీ మంత్రి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని కూటమి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని వాస్తవానికి గంజాయిని గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చి నాయకులు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చిన్నారులను సైతం మత్తుకు బానిసలుగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చి నాణ్యమైన గంజాయిని సైతం అందుబాటులోకి తీసుకువచ్చి అమలు చేశారని సూపర్ సిక్స్త్ హామీలను మాత్రం గాలికి వదిలేసారని ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి గీతా విశ్వనాథ మాట్లాడుతూ ఇతర పార్టీల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగడం అభినందనీయమన్నారు. అంతకుముందు మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తోట నరసింహం మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో లోని హామీలను, మోసాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు, నాయకులు యనమల కృష్ణుడు, రావూరి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబి, గొల్లప్రోలు ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ రామయ్య దొర, జడ్పిటిసి ఉలవకాయల లోవరాజు, గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు, పిఠాపురం మున్సిపల్ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి, యు కొత్తపల్లి ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, నాయకులు మొగలి అయ్యారావు, జ్యోతుల బీముడు, మొగలి సాంబశివ, రావు చిన్నారావు, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్