ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 05 :- జోగులాంబగద్వాలజిల్లా గద్వాల మండలంలోని దౌదార్‌పల్లి,పరుమాల సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థినిలు ఉన్నారు ?.. వారికి సరిపడా బెడ్స్ (మంచాలు), మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నాయా? లేదా ? అని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు ఫలితాలు ఎలా వస్తున్నాయి అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినిలు నిద్రించే గదుల్లోకి వెళ్ళి బెడ్స్, ఆహార పదార్థాలు,వంట గదులు, మరుగుదొడ్లు, పాఠ్య పుస్తకాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని,అట్టి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని ప్రిన్సిపాల్ కి సూచించారు.విద్యార్థులు అన్ని క్రీడల్లో పాల్గొని ప్రతిభను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.ఇందుకోసం పాఠశాలలో నాణ్యమైన క్రీడాసామగ్రి, అవసరమైన సౌకర్యాలు,అన్ని క్రీడలకు అనుకూలమైన మైదాన వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు.ప్రతి విద్యార్థి తప్పకుండా యూనిఫాం ధరించాలని తెలిపారు.అన్ని పుస్తకాలు ప్రతి విద్యార్థికి సమంగా అందేలా పంపిణీ చేయాలని సూచించారు.హాస్టల్లో డైట్ ప్లాన్ అమలును పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలన్నారు.విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో బాగా చదివి, మంచి స్థాయికి ఎదిగి,తాము చదువుకున్న పాఠశాలలు, కళాశాలలకు గౌరవం తీసుకురావడమే కాకుండా,తమ భవిష్యత్తు కోసం సహకరిస్తున్న ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అలివేలు, అనీల,పాఠశాల సిబ్బంది, విద్యార్థినిలు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..