కృష్ణాజీసేవలు మరువలేనివి

మన న్యూస్ పాచిపెంట, జూన్ 30:- పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కృష్ణాజీ రావు సేవలు జీవితంలో మరువలేమని సీనియర్ ఉపాధ్యాయులు యడ్ల నానాజీ రావు కొనియాడారు.సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పంచాది కృష్ణాజీరావు ఇంటి వద్ద నుంచి పాచిపెంట ప్రధాన రహదారిలో ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులంతా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయనకు ఘనంగా సత్కరించారు. దారి పొడుగునా పువ్వుల వాన కురిపించారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు బంగారం చేసినందుకుగాను ఆయన వెంబడి ఆ పిల్లల తల్లిదండ్రులు పాత ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు కలసి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కు హాజరయ్యారు. విజయవంతం చేశారు.అంతేకాకుండా గతంలో తాను ఆధ్యాత్మిక ప్రసంగాలు ద్వారా ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చినందుకుగాను సాలూరు,పాచిపెంట, రాంబద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం బొబ్బిలి పట్టణాలు నుంచి పాత విద్యార్థులు ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు,వైద్యులు,రాజకీయ ప్రముఖులు పలువురు ఆయనకు ఘనంగా సత్కరించి వారి రుణం తీర్చుకున్నారు.పాచిపెంట చరిత్రలో ఇంతవరకు పదవి విరమణ కావించిన ఉపాధ్యాయులకు ఇటువంటి ఘన సత్కారాలు,వీడ్కోలు కార్యక్రమాలు జరగడం ఇదే మొదటిసారి అంటూ పలువురు పంచాది కృష్ణాజీకి బ్రహ్మ రధం పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆయన గురించి పొగుడుతూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురుని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి వ్యక్తి మరలా మనకు దొరకడనే బాధతో నిట్టూర్పుతో మాట్లాడారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన అరుణాచలం ఆ మహాదేవుడు పరమేశ్వరుడు సన్నిధిలో తన శేష జీవితాన్ని కొన సాగిస్తానని కృష్ణాజీ రావు తెలిపారు. పై కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..