మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి, సమస్యలను పరిష్కరించాలి – ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు, : మున్సిపాలిటీ పరిధిలో సైడ్ డ్రైనేజ్
కబ్జా,ప్రహరీ గోడల నిర్మాణాలతో సమస్యలు ఏర్పడుతున్నాయని, మరోవైపు వర్షాకాలంతో ముంపు సమస్యలు పొంచి ఉన్నాయని తక్షణమే అధికారుల చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలజీ నగర్ లో తక్కువ స్థలంలో ఆకాశాన్నంటే రీతిలో అక్రమ నిర్మా ణాలు కొనసాగుతున్నాయని, తద్వారా ట్రాఫిక్, తాగునీటి, డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వెంటనే సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కాలనీలో కొందరు ఇంటి యజమానులు సైడ్ డ్రైనేజ్ పై అక్రమంగా ప్రహరీ గోడలు నిర్మించడం డ్రైనేజీలో నీరు పోక కాలనీలో ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని, పేర్కొన్నారు. గతంలో 2022 వరదల సమయంలో డ్రైనేజీ కబ్జాల వల్ల మా ఇళ్లు మునిగిపోవడాన్ని గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే గారు సైడ్ వాల్ కూల్చివేయించారని,2024 ఆగస్టు 31న వర్షం కురిసినప్పుడు 256 ఇళ్లు మళ్ళీ మునిగిపోయాయన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబా
నికి రూ.16,500 నష్టపరిహారం అందించిందన్నారు. మళ్ళీ కొంతమంది కొత్త ఇంటి యజమానులు డ్రైనేజ్ పై భాగాన్ని కబ్జా చేసి ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారని, ఫలితంగా డ్రైనేజీ లో చెత్త తొలగించడానికి మార్గం లేకుండా పోయిందన్నా రు. అలాగే, వీరిలో చాలామంది ఇంట్లో వాడిన మురికి నీళ్లను రోడ్డుపైకి వదులుతున్నారని,దీని వల్ల రోడ్లు బురదగా మారి పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. ఈ సమస్యపై గతంలో తహశీల్దార్,మున్సిపల్ కమిషనర్ గా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలను, అడ్డుకోవాలని, ప్రజలను ముంపు నుండి కాపాడాలని ఆయన కోరారు.

Related Posts

ఎల్బీనగర్లో ప్రమాదం

ఎల్బీనగర్ మన ధ్యాస :ఎ

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎల్బీనగర్లో ప్రమాదం

ఎల్బీనగర్లో ప్రమాదం

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ