పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

  • ఇంటి నిర్మాణానికి తవ్విన గుంతలో పడిన ముగ్గురు ఒకరు మృతి మరొకరు పరిస్థితి విషమం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- నూతనంగా ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కొరకు తవ్విన గుంతలోకి ఆడుతూ పాడుతూ వెళ్ళి ప్రమాదవశాత్తూ నీళ్ళలో పడిన ఇద్దరు పాఠశాల విద్యార్థుల్లో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల సమీపంలోని ఇండియన్ మెధడిస్ట్ ఎవాంజిలిజం చర్చి పక్కనే శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం జరిగింది.ఇటువలె నాలుగు రోజులుగా వర్షాలు విస్తరంగా పడడంతో గుంతలన్నీ నీటితో మునిగిపోయాయి. పాఠశాల నుండి ఇంటికి చేరిన చిన్నారులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పుస్తకాలు యూనిఫామ్ ఇంటిదగ్గర జాగ్రత్త చేసుకొని ఆటలకై వెళుతూ గుంతలు గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదే మార్గంలో వెళ్తున్న స్థానికుడు చిన్నారుల నీటిలో మునగగానే గమనించి తక్షణమే రక్షించే ప్రయత్నం చేశారు. వీరిలో ఒకరు క్షేమంగా బయటపడగా మిగిలిన ఇద్దరు భూర్తి. మహి,(7 ) (తండ్రి) సత్తిబాబు, పులి. ప్రణయ్ జోష్ (7)(తండ్రి) పులి రాధాకృష్ణ అప్పటికే మునిగిపోయి బురద నీటిని తాగడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే శంఖవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా భూర్తి మహి మార్గ మధ్యలో చనిపోయాడు. ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న పులి ప్రవీణ్ జోష్ ను శంఖవరం ఆస్పత్రి నుండి రౌతులపూడి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు 108 అంబులెన్స్ వాహనంలో కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన భూర్తి మహి కుటుంబ సభ్యులు వార్ణనతీతంగా మారింది.మృతి చెందిన బాలురు తండ్రికి మహి మూడవ సంతానం, వీరిది వ్యవసాయ కుటుంబం, నివాసానికి ఇల్లు లేని పరిస్థితి నెలకొంది.

  • Related Posts

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మండలంలోని రామానాయుడు పల్లి వద్ద రాష్ట్రప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలు రకాల పండ్లు , పూలు తో చేసిన గజమాలలను క్రేన్ తో ఆయనకు…

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    మన న్యూస్ పాచిపెంట, జూన్ 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట,అధిక ధరలుకు ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతి రావు ఎరువుల దుకాణాల డీలర్లను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు