

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం ముమ్ముర తనిఖీలు చేపట్టారు.. గూడూరు మండలం టిట్కో నివాసాల నివాసాలు ఉంటున్న గృహాలపై వారు దాడులు నిర్వహించే అనుమతి లేని 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే నాలుగు కార్లను కూడా సరైన పత్రాలు లేకుంటే సీజ్ చేసినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. నూతన వ్యక్తుల సంచారం గాంజా మత్తుపదార్థాల విక్రయాలపై ఆయన ఆరా తీశారు. అనుమానితులపై నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో ఎవరైనా నూతన వ్యక్తులు అపరిచిత వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని అక్కడి స్థానికులకు తెలియజేశారు. డిఎస్పి గీతా కుమారి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

