ప్రజలు భాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధిఎం.ఈ.ఓ రమణయ్య

మన న్యూస్ సింగరాయకొండ:-

బద్దిపూడి గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆడిటర్ బల్లెకూర ఏడుకొండలు తనయుడు నీరజ్ ఇటీవల యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం పొందిన సందర్భంగా తమ తల్లిదండ్రులు కీ. శే.
బల్లెకూర రమణయ్య, సీతారావమ్మ స్మరించుకుంటూ బద్దిపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు పి యం పి మరియు కె ఎం పి లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 20,000 రూపాయలు విలువ చేసే విద్యా సామాగ్రి అందజేశారు.
అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారి పి వి రమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వామ్యం కావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,నూతన వస్తువులు, దుస్తులు,పుస్తకాలు విద్యార్థుల నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని, ప్రైమరీ సెక్షన్ లోని ఉపాధ్యాయులు ప్లే వే మెథడాలజీ ఉపయోగించి విద్యార్థులకు చక్కని భోదన అందించాలని సందర్భంగా తెలియజేశారు.వెలుగు ప్రాజెక్ట్ ఏ.పి.ఎం గోపినాథ్ మాట్లాడుతూ తాము పుట్టి పెరిగిన ఊరు, తాము బాల్యంలో చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులకు ఈ విధంగా విద్యాపరమైన సహకారం అందించడం తమ బాధ్యతని అన్నారు.గ్రామ పెద్దలు కూనం యలమండారెడ్డి దాతలను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని తాటితోటి వరలక్ష్మి,హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుదర్శి గోపి,వెలుగు ప్రాజెక్ట్ ఏపీఎం కృష్ణయ్య,సీసీ సురేష్, జిలాని,బల్లెకూర శ్రీనివాసులు, మధు మరియు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..