ప్రజలు భాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధిఎం.ఈ.ఓ రమణయ్య

మన న్యూస్ సింగరాయకొండ:-

బద్దిపూడి గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆడిటర్ బల్లెకూర ఏడుకొండలు తనయుడు నీరజ్ ఇటీవల యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం పొందిన సందర్భంగా తమ తల్లిదండ్రులు కీ. శే.
బల్లెకూర రమణయ్య, సీతారావమ్మ స్మరించుకుంటూ బద్దిపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు పి యం పి మరియు కె ఎం పి లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 20,000 రూపాయలు విలువ చేసే విద్యా సామాగ్రి అందజేశారు.
అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారి పి వి రమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వామ్యం కావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,నూతన వస్తువులు, దుస్తులు,పుస్తకాలు విద్యార్థుల నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని, ప్రైమరీ సెక్షన్ లోని ఉపాధ్యాయులు ప్లే వే మెథడాలజీ ఉపయోగించి విద్యార్థులకు చక్కని భోదన అందించాలని సందర్భంగా తెలియజేశారు.వెలుగు ప్రాజెక్ట్ ఏ.పి.ఎం గోపినాథ్ మాట్లాడుతూ తాము పుట్టి పెరిగిన ఊరు, తాము బాల్యంలో చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులకు ఈ విధంగా విద్యాపరమైన సహకారం అందించడం తమ బాధ్యతని అన్నారు.గ్రామ పెద్దలు కూనం యలమండారెడ్డి దాతలను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని తాటితోటి వరలక్ష్మి,హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుదర్శి గోపి,వెలుగు ప్రాజెక్ట్ ఏపీఎం కృష్ణయ్య,సీసీ సురేష్, జిలాని,బల్లెకూర శ్రీనివాసులు, మధు మరియు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

  • Related Posts

    భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.

    గూడూరు, మన న్యూస్ :- హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనుకొనే ప్రతి హిందూవు నీ ధర్మాన్ని.. నీ దేవుడు గుడి ఆస్తులను కాపాడుకొనే రక్షకుడువి నువ్వే… గుడికి వెళ్లే మీరు ఇచ్చే కానుకులకు హుండీలో వెయ్యకుండా.. హిందూ సనాతన ధర్మమాన్ని నమ్ముకే…

    బలరామ్మూర్తి త్వరగా కోలుకోవాలి..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపరూప్):- కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ క్రైమ్ ఏఎస్ఐ గంగిరెడ్డి బలరామ్మూర్తి ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో బలరామ్మూర్తి ను మాజీమంత్రి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.

    భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.

    బలరామ్మూర్తి త్వరగా కోలుకోవాలి..

    బలరామ్మూర్తి  త్వరగా కోలుకోవాలి..

    పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

    పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

    మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..

    మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..

    వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు

    • By RAHEEM
    • June 29, 2025
    • 3 views
    నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు