

గూడూరు , మన న్యూస్:- గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు లయన్స్ టౌన్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడుగా మోడీబోయిన శీను యాదవ్ , సెక్రెటరీ వెడ్చర్ల వెంకయ్య , ట్రెజరర్ పసుపులేటి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గా పైడిమర్రి రాజేంద్రప్రసాద్ , జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, జాయింట్ ట్రెజరర్ పల్లమాలప్రభాకర్ , నూతన సభ్యుడు వై జె పి జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్ర బత్తిన గుర్రాథం , పయ్యావులమురళి నాయుడు వైస్ గవర్నర్ ఆర్ వి రావు, క్లబ్ ప్రెసిడెంట్ పట్నం వెంకట మనోజ్ కుమార్ , ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి , రవీంద్రా రెడ్డి , ఎస్ ఎల్ ఎన్ స్వామి, మురళీకృష్ణ , కావేరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ వై గురునాథం మాట్లాడుతూ 2025- 26 సంవత్సరమునకు నూతన కార్య వర్గాన్ని అభినందిస్తూ పేదలకు మంచి సేవలు అందించాలని నూతన వర్గాన్ని కోరడం జరిగింది. అనంతరం మురళి నాయుడు మాట్లాడుతూ కొత్త సభ్యులనే చేర్పించిన వారికి లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా గుర్తించి వారికి జ్ఞాపకాలను అందించడం జరుగుతుందని తెలిపారు.