కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి-సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 27 :జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రం గంటవీధిలో గల ఇటీవల హత్యకు గురైన తేజేశ్వర్ కుటుంబ సభ్యులను పమర్శించారు. ఎమ్మెల్యే తేజేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ హత్య బాధాకరమన్నారు. ఇటీవల పాతపాలెం లో ఇదే తరహాలో హత్య చేయబడిందన్నారు. ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులే పరిష్కారం అన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన నిందితులను ఆరు నెలల్లోపు శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నిందితులకు శిక్ష పడడం వల్ల బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే విధంగా ఉన్నాయని, జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఫాస్ట్గా కోర్టు ఏర్పాటు చేయడమే మంచిదన్నారు దీని ద్వారా తప్పు చేసిన వారికి త్వరగా శిక్షలు పడే అవకాశం ఉందన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కేసును త్వరితగతిన చేదించిన పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు .ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ , జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్స్ మురళి, కృష్ణ మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, ఆలయం కమిటీ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు గోవిందు కురుమన్న, ధర్మ నాయుడు కొత్త గణేష్, షాషా జయరాములు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమం పురస్కరించుకుని పరిసరాల పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాలని,…

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ గేట్ సమీపంలోని పిఎసిఎస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సహకార సంఘం చైర్మన్ నర్సింహ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

  • By RAHEEM
  • June 28, 2025
  • 3 views
పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

  • By RAHEEM
  • June 28, 2025
  • 4 views
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్  క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్