రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః– రాజ‌కీయ ల‌బ్ది కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాన‌వ‌త్వం లేకుండా వ్య‌వ‌హరిస్తున్నార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఆరోపించారు. అల్ల‌రి మూక‌ల జేజేల కోసం త‌న కారు కింద ప‌డి కార్య‌క‌ర్త ప్రాణాలు పోతున్నా ప‌క్కకు లాగి ప‌డేసి సింగ‌య్య చావుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కార‌కుడైయ్యార‌ని ఆయ‌న త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగిన మీడియా స‌మావేశంలో విమ‌ర్శించారు. సింగ‌య్య కుంటుంబాన్ని పరామ‌ర్శించ‌క పోవ‌డంతోపాటు మ‌రో కార్య‌క‌ర్త గుండెపోటుతో మృతి చెందితే ప‌ట్టించుకోని నాయ‌కుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అని ఆయ‌న అన్నారు. పార్టీ కార్య‌కర్త‌ల ప్రాణాల‌కు విలువ ఇవ్వ‌ని నాయ‌కుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌రామ‌ర్శ‌కు వెళ్ళే ముందు పోలీసుల సూచ‌న‌ల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతుండ‌టంతో కార్య‌క‌ర్త‌ల ప్రాణాలు పోతున్నాయ‌న్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల నుంచి ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లకు ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆయ‌న పార్టీ నాయ‌కులు ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తే తొక్కినార‌తీస్తామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రించార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఉనికి కోస‌మే క‌రుణాక‌ర్ రెడ్డి విమ‌ర్శ‌లు: ఆర‌ణి శ్రీనివాసులు తాను కానీ, ఎన్డీఏ కూట‌మి నాయ‌కులు క‌బ్జాల‌కు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డి ఉంటే మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి నిరూపించాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు స‌వాల్ విసిరారు. కేవ‌లం త‌న ఉనికిని కాపాడుకునేందుకే క‌రుణాక‌ర్ రెడ్డి టిటిడిపైనా, ఎన్డీఏ కూట‌మిపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వైన్ షాపులు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 24గంట‌లు ఓపెన్ చేసి నాసిర‌కం మ‌ద్యం అమ్మిన చ‌రిత్ర క‌రుణాక‌ర్ రెడ్డి మ‌రిచిపోయినా ప్ర‌జ‌లు మ‌రిచి పోలేద‌ని ఆయ‌న అన్నారు. మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిపాల‌న భ‌వ‌నం పెండింగ్ ప‌నుల పూర్తికి చాణిక్య లాడ్జీ స్థ‌లాన్ని అమ్మాల‌ని ఎవ‌రికీ లేదన్నారు. అయితే ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై క‌మిటీ వేసి ఆ క‌మిటీ సూచ‌న మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబితే వైసిపి కార్పోరేట‌ర్లే బల్ల‌లు చ‌రిచి మ‌ద్ద‌తు ఇచ్చార‌ని ఆయ‌న చెప్పారు. వైసిపి కార్పోరేట‌ర్ల‌కు తాను వ‌త్తాసు ప‌ల‌క లేదన్నారు. క‌రుణాక‌ర్ రెడ్డి వైఖిరితోనే వైసిపి కార్పోరేట‌ర్లు జ‌న‌సేన, టిడిపిలోకి వ‌చ్చార‌ని ఆయ‌న తెలిపారు. టౌన్ బ్యాంక్ లో జ‌రిగిన అక్ర‌మాల‌పై అధికారుల క‌మిటీ విచార‌ణ చేప‌ట్టింద‌ని, కొంద‌రు డైర‌క్ట‌ర్లు అప్రూవ‌ర్స్ గా మారి నిజాలు చెప్పార‌ని ఆయ‌న చెప్పారు. త్వ‌ర‌లోనే బ్యాంక్ డ‌బ్బు దోచుకున్నావాళ్ళు శిక్ష‌ను అనుభ‌విస్తార‌ని ఆయ‌న తెలిపారు. ఈ స‌మావేశంలో జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్ష‌లు రాజా రెడ్డి, బాబ్జీ, మున‌స్వామి, ఆకేపాటి సుభాషిణి, అనీల్ రాయ‌ల్, హేమ‌కుమార్, వెంక‌టేష్, జాన‌కిరామ్, ప‌గ‌డాల ముర‌ళీ, రాధా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరి, మన న్యూస్ : ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్. గండిపాలెం వాగు నుండి అక్రమంగా అనధికారికంగా జెసిబిలను ఉపయోగించి ట్రాక్టర్లతో ఇసుకను పూడిక ఇసుకను అక్రమంగా తరలిస్తూ… ప్రభుత్వ ఆదాయానికి…

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లె లో మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ ఆధ్యర్యంలో మాదిగ మహా మేళా కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తో ఎస్సీ వర్గీకరణను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

పొలం పిలుస్తోంది

పొలం పిలుస్తోంది

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం