చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్ 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం చోడి పంటకు మంచి మద్దతు ధర ప్రకటించిందని రైతులు దళారులను నమ్మి పంటలు వేయొద్దని గొట్టూరు సర్పంచ్ మాదల సింహాచలం అన్నారు గొట్టూరు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న పంట వైపు మళ్లుతున్నారని నీటి సదుపాయం లేని మొక్కజొన్న ఆర్థికంగా లాభదాయకంగా ఉండదని దాని స్థానంలో ఎలాంటి ఖర్చులు లేని చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని కోరారు రైతులు ఒకే పంట కాకుండా పలు పంటలు వేసుకోవాలని గట్లు మీద పండ్ల మొక్కలు కూరగాయలు సాగు చేసుకోవాలని అంతర పంటలు అభివృద్ధి చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని ప్రకృతి సేద్య పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని కాబట్టి రైతులు ప్రకృతి సేద్యం దిశగా మల్లాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన రైతులకు 90% రాయితీపై విత్తనాలు అందిస్తుందని అలాగే కంది పంట చిరు సంచులను ఉచితంగా అందజేస్తుందని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు అనంతరం రైతులు మాట్లాడుతూ 20 మంది వరకు పిఎం కిసాన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని అలాగే ఈ సంవత్సరం ఉలవ పంటకు మద్దతు ధర తో కొనుగోలు చేపట్టాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు గ్రామ వ్యవసాయ సహాయకులు భారతి కిరణ్ ప్రకృతి సేద్య ఉద్యోగులు సురేష్ అప్పన్న మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరి, మన న్యూస్ : ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్. గండిపాలెం వాగు నుండి అక్రమంగా అనధికారికంగా జెసిబిలను ఉపయోగించి ట్రాక్టర్లతో ఇసుకను పూడిక ఇసుకను అక్రమంగా తరలిస్తూ… ప్రభుత్వ ఆదాయానికి…

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లె లో మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ ఆధ్యర్యంలో మాదిగ మహా మేళా కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తో ఎస్సీ వర్గీకరణను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

పొలం పిలుస్తోంది

పొలం పిలుస్తోంది

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం