శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

  • శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ డిడివో గా బాధ్యతలు

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో డాక్టర్ శెట్టిబత్తుల రాజీవ్ కుమార్ నూతన డిడిఓ (డ్యూటీ మెడికల్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆయనను శంఖవరం పిహెచ్సీ వైద్య అధికారిగా సేవలు అందిస్తున్న రాజీవ్ కుమార్ కు డి డి ఓ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. వైద్యులు ఆర్వివి సత్యనారాయణ 6 సంవత్సరాల 5 నెలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రధాన వైద్యాధికారి (డి డి వో) గా పని చేసారు. ధవలేశ్వరం పి హెచ్ సి కి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా స్థానిక వైద్య సిబ్బంది, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ – “గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యసేవలను సమయానికి అందించడం నా మొదటి కర్తవ్యం అని పిహెచ్సీలో విస్తృతంగా ఆరోగ్య సేవలను అందించేందుకు సిబ్బంది సహకారంతో పని చేస్తానన్నారు. ప్రజలతో సమన్వయం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు క్యాంపులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. నూతన విధానాలు తీసుకురావడంలోనూ కృషి చేస్తాం” అని తెలిపారు. నేటి టెక్నాలజీ ప్రకారం నూతన వైద్య విధానాలపై రాజీవ్ కుమార్ విశేష అవగాహన ఉందని నూతన డిడిఓ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రజలు మెరుగైన సేవలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్న చిన్న సమావేశంలో ఆరోగ్య కేంద్రంలో ఉన్న సదుపాయాలపై సమీక్ష చేసి, తక్షణమే అవసరమైన పరికరాల సమీకరణ కోసం ప్రతిపాదనలు పంపుతానని హామీ ఇచ్చారు.

  • Related Posts

    డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ—విశ్రాంతి ఉద్యోగుల సంఘం.

    బద్వేల్: జూన్ 24: మన న్యూస్: సేవా తత్పరుడు నిరాడంబరుడు స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి రెడ్డి…

    దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

    మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శింగరాయకొండలో 7వ తరగతి చదువుతున్న దేవినేని భవ్యశ్రీ భారత్ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ తరపున నిర్వహించిన “ది లార్జెస్ట్ కూచిపూడి నృత్యం” కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ గిన్నిస్ రికార్డు సాధించి తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇరాన్ పై అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ఖండించండి, సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్.

    ఇరాన్ పై అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ఖండించండి, సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్.

    డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ—విశ్రాంతి ఉద్యోగుల సంఘం.

    డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ—విశ్రాంతి ఉద్యోగుల సంఘం.

    విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

    విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

    దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

    దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

    నెల్లూరులో వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు

    నెల్లూరులో వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు

    యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

    యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్