

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
:పట్టణంలోని శిరిడి నగర్లో బిజెపి కార్యాలయంలో కాకినాడ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు సోమవారం డాక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉమ్మిడి మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతదేశంలో ఒకే రాజ్యాంగం,ఒకే ప్రధాని, ఇంకే విధానం ఉండాలని ఆకాంక్షించిన గొప్ప జాతీయ వాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో దొంతంశెట్టి శేఖర్, ఆలేటి అనిల్ కుమార్,కే లక్ష్మి,పి పావని, శివాజీ తదితరులు పాల్గొన్నారు.