మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్

విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని SI రమేష్ సూచించారు.

మన న్యూస్ నర్వ మండలం :- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా Heal your mind & plant a tree- Say no to డ్రగ్స్,అనే నినాదం తో సోమవారం, నర్వ మండలంలోని కల్వాల్ గ్రామంలో ZPHS స్కూల్లో నర్వ ఎస్సై ఆధ్వర్యంలో డ్రగ్స్,గంజాయి వంటి మత్తుపదార్థాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై గారు విద్యార్థులతో మాట్లాడుతూ..విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. మీ కాలనీ, మీ చుట్టూ ప్రక్కల ప్రాంతం లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీస్ దృష్టికి తీసుకురావాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి