

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 23:- జోగులాంబ గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మండలం చాగదోన గ్రామానికి మంజూరైన 31 ఇండ్లలో ఈరోజు ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభింపజేశారు కుమ్మరి పద్మ నర్సింలు గాండ్ల శోభ సతీష్ ఇండ్ల నిర్మాణానికి గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్ భూమి పూజ చేయడం జరిగినది ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు త్వరగా నిర్మించుకొని పనులు పూర్తి చేసుకోవాలని ఎంపీపీ వారిని కోరారు. ఈ కార్యక్రమంలో_పంచాయితీ కార్యదర్శి ఆంజనేయులు గౌడ్’జై. వీరశేఖర్ స్వామి’రామచంద్ర గౌడ్ శివప్ప, తిరుమల గౌడ్ ,జయరామ్ గౌడ్ వడ్డే నాగన్న,వడ్డే శేఖర్ మొండి భాస్కర్ ,అశోక్ రవి ,తూనే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
