


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి,సరిత టీచర్ లకు విద్యార్థులు రహీం,ప్రశాంత్, సంగమేశ్వర్ గౌడ్,సాయిరాం, శ్రీకాంత్,మంజుల,శివలీల,సాయిలు, రేణుక,వెంకటేశం,హరీష్ లు అందరూ కలిసి శాలువా పూలమాల జ్ఞాపకను అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం టీచర్స్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విద్యార్థులు అలాగే ఉన్నారని ప్రతి ఒక్కరూ ఇంకా మంచిగా ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా వారు కోరారు.