ప్రత్తిపాడు ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో రేపే లక్ష దీపోత్సవం*

* *గోదా రంగనాథ గోష్టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ*

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్టి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు అనగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా గోదా రంగనాథ గోష్టి గురువర్యులు గుదిమెళ్ళ లక్ష్మణాచార్యులు,జయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యమని,ఈ శ్రీరామనామ క్షేత్రంలో జరుగుతున్న లక్ష దీపోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరమశివుడు ఆశీస్సులు పొందాలని కోరారు.అలాగే ఆలయ కమిటీ సభ్యులైన చాట్ల పుష్పా రెడ్డి,రెడ్నం రాజా,పత్రి రమణ,గోగులు బుజ్జిలు మాట్లాడుతూ ఆంధ్రా భద్రాద్రి క్షేత్ర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలనే సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని,భక్తులు యావన్మంది విచ్చేసి దీపాలను వెలిగించి స్వామివార్ల కృపా కటాక్షాలు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో గోదా రంగనాథ మహిళా కమిటీ సభ్యులు,నాగ ఆంజనేయులు,మేడిద నాగార్జున పాల్గొన్నారు.

  • Related Posts

    ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన న్యూస్, నెల్లూరు, మే 8 :- విపిఆర్ ఫౌండేషన్ చే విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పనులకు 15 లక్షల ఆర్ధిక సహాయం.- క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం…

    వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

    మన న్యూస్ పాచిపెంట మే 8:= రైతు సాధికారిక సంస్థ ప్రకృతి సేద్య ఉద్యోగులు మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో ముందుకి సాగినప్పుడే ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా నడుస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కాబోయే చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. గురువారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

    వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

    కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    కూటమి ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని మండిపడ్డ…….ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    కూటమి ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని మండిపడ్డ…….ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా వెంకటరావు

    జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా వెంకటరావు