శ్రీమతి నారా భువనేశ్వరి – ఒక నిశ్శబ్ద ధైర్యం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- కష్టాలకు వెరవని ధైర్యం, సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం, మహిళా జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నారా భువనేశ్వరమ్మ ఒక నిశ్శబ్ద ధైర్యం అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రాముని కుమార్తె, తెలుగువారి ఆత్మవిశ్వాసానికి స్పూర్తి ప్రదాత నారా చంద్రబాబు ధర్మపత్ని, తెలుగువారి భవిష్యత్తు పై భరోసా కల్పించిన నాయకుడు నారా లోకేష్ మాతృమూర్తి శ్రీమతి నారా భువనేశ్వరి కి 65 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, భువనమ్మకు దివ్యాశీస్సులు అందించమని జయరాం రావు వీధి లోని శ్రీ శీతలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతూ, ఆర్తులకు అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళిగా జీవించాలని కోరుకుంటూ పూజలు చేశారు.
బిసి తేజం రవీంద్రుని కోసం ప్రార్ధనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి,మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు,బిసి తేజం కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పేరున కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అర్చనలు చేయించడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వంలో తీవ్రమైన అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణమే వారి వద్దకు వచ్చి అండగా నిలిచిన బిసిల పాలిట ఛత్రపతి మన రవీంద్రన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్,వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,
తిరుపతి పార్లమెంటు నాయకులు బీమాల భాస్కర్, సంజాకుల మురళీకృష్ణ, పూల శేఖర్, రమేష్, మల్లికార్జున, విద్యుత్ సంస్థ ఉద్యోగ సంఘ నాయకుడు ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!