తెలంగాణ లో అభివృద్ధి కేంద్రప్రభుత్వానిదే..కాంగ్రెస్ పార్టీ దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదు..11 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం అద్భుతాలు చేసింది.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19 : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మెలచెర్వు గ్రామంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల అమృతకాల సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ..11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి దేశానికి స్వర్ణ యుగాన్ని తెచ్చింది అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వము కీలక పాత్ర పోషిస్తుందని, గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నాయనిఅన్నారు..నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల లో ఎవరు ఊహించని విధంగా దేశంలో అద్భుతమైన సుపరిపాలనను అందించి దేశాన్ని వికసిత భారత్ గా మలిచేందుకు అనేక రకాలైన చట్టాలను తయారు చేసిందని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద 12 కోట్ల టాయిలెట్ల నిర్మాణము, ఉజ్వల పథకం కింద 10 కోట్ల ఉచిత సిలిండర్ పంపిణీ, ఉచిత బియ్యం పంపిణీ, భీమా సేవలు, డిజిటల్ ఇండియా లో భాగంగా అందరికీ అకౌంట్లు, రోడ్లు, రైల్వేల అభివృద్ధి, ఉచిత కరోనా టీకాలు, ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన కింద అందరికీ పక్కా ఇండ్లు, ఇంటింటికి కులాయి నీళ్లు, విద్యుత్ వ్యవస్థ బలోపేతం, కిసాన్ సమ్మన్ నిధి, ఫసలు బీమా యోజన, పంటలకు మద్దతు ధరల పెంపు, కాశ్మీర్ 370 ఆర్టికల్ తొలగింపు, ముస్లిం మహిళల రక్షణ కోసం త్రిపుల్ తలాక్ చట్టం, రామ మందిర నిర్మాణం, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, రక్షణ రంగ బలోపేతము, సంబంధాలు, ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం అనేక రకాలైన చట్టాలను తీసుకువచ్చి తద్వారా 2047వ సంవత్సరం వరకు ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారత్ ను నిలిపేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అక్కల రమాదేవి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నరేష్ గౌడ్, బిజెపి మహిళ మోర్చా శోభారాణి,బద్రి , గ్రామ ప్రజలు హాజరయ్యారు..

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!