రైతులకు పెట్టుబడి భరోసా – రూ140.07 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ

గద్వాల జిల్లా మన న్యూస్. రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అభివృద్ధినే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద,వానాకాలం సాగు ప్రారంభానికి ముందే గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న,సన్నకారు రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ చేసిందని తెలిపారు.ఈరోజు గురువారం సాయంత్రం వరకు నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన 1,35,024 మంది రైతులకు 140 కోట్లు 7 లక్షల 76 వేల 525 రూపాయలు సాయం అందించబడిందని తెలిపారు.ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం వల్ల వారు ఎలాంటి ఆలస్యం లేకుండా విత్తనాలు, ఎరువులు,కూలీల ఖర్చులు మొదలైన అవసరాలను తీర్చుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. రైతుల బ్యాంక్ ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులు రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయడం,వారి భూ వివరాలను అనుసరించి అర్హత గలవారికి నిధులను విడుదల చేయడం వంటి ప్రక్రియలు సమర్థంగా నిర్వహించబడినట్టు తెలిపారు.మిగిలిన రైతుల ఖాతాల్లోనూ త్వరలోనే నిధులు జమ చేయబడతాయన్నారు.రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ పథకం రైతులకు కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా స్థిరత్వాన్ని ఇస్తోందని,ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. విత్తనాలు వేసే ముందే సాయం అందడం వల్ల రైతులు అప్పుల ఊబిలో పడకుండా సాగు చేసే అవకాశం లభిస్తుందని,ఇది వ్యవసాయ ఉత్పాదకతను మరింత పెంపొందించగలదని అన్నారు.ప్రతి ఎకరాకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు. ఇది కేవలం నిధుల పంపిణీ మాత్రమే కాదు – రైతన్నలపై ప్రభుత్వం ఉంచిన విశ్వాసానికి నిదర్శనం,” అని కలెక్టర్ స్పష్టం చేశారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి