పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్17:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు అన్నారు. చిట్టెలబ గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి మంగళ మరియు బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించబడుతుందని రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పోడు వ్యవసాయంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు పండిస్తున్నారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా చిరుధాన్యాలకు మంచి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని చోడి పంటకు కేజీ 49 రూపాయలకు పైగా మద్దతు ధర ఉందని కాబట్టి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు చిరుధాన్యాలను మరియు వరి వంటి విత్తనాలను 90% రాయితీపై గిరిజనులకు అందిస్తున్నామని ప్రభుత్వం ఇచ్చే ఈ రాయితీలను సద్వినియోగం చేసుకొని పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా నూతన సాంకేతిక సాగులో మెలకువలను తెలుసుకుని సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడిని కూడా పెంచాలని కోరారు గ్రామంలో నలుగురు రైతులు అన్నదాత సుఖీభవ ఈ కేవైసీ చేయించుకోలేదని వారు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారని తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రకృతి సేద్య ఉత్పత్తులకు అధిక ధరలు కల్పించాలని అలాగే ప్రకృతి సేద్యానికి కావలసిన ముడి సరుకులను కూడా రాయితీపై అందిస్తే పోడు వ్యవసాయపు దిగుబడులు పెంచుకోగలుగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ కుమార్ ప్రకృతి సేద్య క్లస్టర్ ఇంచార్జ్ సురేష్ కుమార్ అప్పన్న మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు