ఎమ్మెల్యే చే సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి

మన న్యూస్,తిరుప‌తిః– ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను న‌లుగురు ల‌బ్దిదారుల‌కు సోమ‌వారం సాయంత్రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కార్యాల‌యంలో అందించారు. 11వ డివిజ‌న్ కు చెందిన రాధాకృష్ణ రాజు స‌తీమ‌ణి వ‌సంత అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాధాకృష్ణ రాజుకు రెండు ల‌క్ష‌లా డెబ్బ‌య్ నాలుగు వేల రెండు వంద‌లా అర‌వై ఐదు రూపాయ‌లు మంజూరు కాగా ఆ చెక్క్ ను ఎమ్మెల్యే ఆయ‌న‌కు అందించారు. అలాగే 44 వ డివిజ‌న్ కు చెందిన ల‌క్ష్మీదేవికి ల‌క్షా తొంభై మూడు వేల ఆరు వంద‌ల న‌ల‌భై తొమ్మిది రూపాయ‌ల చెక్ ను ఎమ్మెల్యే అందించారు ఈమె భ‌ర్త సుబ్ర‌మ‌ణ్యం శెట్టి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా 36వ డివిజ‌న్ ఎస్ డి రోడ్డ్ కు చెందిన ఆర్. భానుప్ర‌కాష్ కు ల‌క్షా న‌ల‌భై మూడు వేల మూడు వంద‌ల ముప్పయ్ ఎనిమిది రూపాయ‌ల చెక్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఇచ్చారు. అలాగే 8వ డివిజ‌న్ కు చెందిన వై. ముర‌ళీకి ల‌క్షా ఇర‌వై ఎనిమిది వేలా నాలుగ‌వంద‌లా తొంభై మూడు రూపాయ‌ల చెక్ ను అందుకున్నారు. ఇంటి పెద్ద అనారోగ్యం పాలై తే కుటుంబ‌మంతా ఇబ్బంది ప‌డుతుంద‌ని ఆ ఇబ్బందిని కొంతైనా త‌గ్గించ‌డానికి పెద్ద‌కొడుకుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సిఎంఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్డీఏ కూట‌మి నాయ‌కులు రాజా రెడ్డి, నైనార్ మ‌హేష్ యాద‌వ్, ఆర్కాట్ కృష్ణ‌ప్ర‌సాద్, వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

  • By RAHEEM
  • June 23, 2025
  • 2 views
పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య