నెల్లూరులో విఆర్ హైస్కూల్ అడ్మిషన్లు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు:- అధునాతన విఆర్ హైస్కూల్ ను చూసి అవాక్కైన తల్లిదండ్రులు .- నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యమన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ .నెల్లూరు వి ఆర్ హైస్కూల్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల కళ్ళల్లో అవధులు లేని ఆనందం కనిపించింది. ఇందుకు కారణం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మహా సంకల్పంతో నిరుపేద విద్యార్థులకు అధునాతన సాంకేతికతతో డిజిటల్ విద్యను అందించేలా రూపుదిద్దిన విఆర్ హైస్కూల్లో అడ్మిషన్ల ప్రారంభం మొదలు కావడమే. వీఆర్ హైస్కూల్లో మంత్రి నారాయణ అడ్మిషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. దీంతో అడ్మిషన్లు పొందిన అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులతో వి ఆర్ హైస్కూల్ కిటకిట లాడింది. తమ బిడ్డల కోసం అత్యాధునిక సౌకర్యాలతో మంత్రి నారాయణ అద్భుతంగా నిర్మించిన వి ఆర్ పాఠశాలను చూసి ఇది కలా… నిజమా అని తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి వి ఆర్ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. మంత్రి నారాయణ కి జీవితాంతం రుణపడి ఉంటామని… తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్న నారాయణ పది కాలాల పాటు చల్లగా ఉండాలని భావోద్వేగంతో మంత్రి నారాయణ దంపతులకు వారు దీవెనలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ..గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ ని వైఎస్సార్సీపీ హయాంలో మూత పడేసిందని.. మా ప్రభుత్వంలో వీఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఉంటుందని..వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు నిరుపేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించబోతున్నట్లు తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్… రవాణా సౌకర్యాలతో పూర్తి ఉచితంగా విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన అందుతుందన్నారు. అన్ని రకాల క్రీడా పరికరాలతో క్రీడా మైదానం ఏర్పాటు చేసామని తెలిపారు. ఏదేమైనా మంత్రి నారాయణ గొప్ప మనసు.. పేదల పట్ల అపారమైన ప్రేమకు నెల్లూరు నగర ప్రజలు ఫిదా అవుతున్నారు. పేదల ఆనందం… చిన్నారుల కేరింతలతో వి ఆర్ పాఠశాల మళ్లీ కళకళలాడడం చాలా సంతృప్తిగా ఉందని, ఇది మర్చిపోలేని రోజులని ఇటు మంత్రి నారాయణ, అటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వి ఆర్ పాఠశాలను తిరిగి ప్రారంభించి ఎన్నికల సమయంలో నెల్లూరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి తెలిపారు. వెయ్యి మందికి పైగా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈనెల 23న లాంఛనంగా వి ఆర్ పాఠశాల ప్రారంభోత్సవం జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని 54 మున్సిపల్ పాఠశాలలను దాతల సహకారంతో ఇదే తరహాగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, పాటు కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్.. టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు,44 డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు,క్లస్టర్ ఇంచార్జి పుట్ట అజయ్,45 డివిజన్ అధ్యక్షుడు సుజన్.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.