ప్రత్తిపాడులో ఘనంగా తూర్పు కాపుల వన సమారాధన మహోత్సవం

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు… మానవ సంబంధాలు మెరుగుపడడానికి,మనుష్యుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కార్తీక మాసంలో వనభోజనాలు దోహదపడతాయని తూర్పు కాపుల సంఘ నాయకులు పత్రి రమణ,గోపిశెట్టి శ్రీను,అప్పికొండ అయ్యప్ప అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్కెస్ట్రా,డాన్స్ బేబీ డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆటపాటలతో, ఉల్లాసంగా,ఉత్సాహంగా గడుపారు.సుమారు 4000 మందికి పైగా హాజరు కావడంతో భోజనాలు చేయడానికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు కాపు కుటుంబాలను ఏకం చేయడానికి కృషి చేసిన గోపిశెట్టి శీను,అప్పికొండ అయ్యప్పలను పత్రి రమణ, కట్టమూరి కొండబాబు మరియు కుల పెద్దలు చేతుల మీదుగా పూలమాలలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పలు వయసులో చిన్నవారైనా చక్కటి ఆలోచనతో అందరినీ ఏకం చేసారని కొనియాడారు.ఇకపై మనమందరం ఐకమత్యంగా ఉండి సంఘంగా ఏర్పడి మన పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.గోపిశెట్టి శ్రీను మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి గుర్తించి వారికి చేయూతనివ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని, అందరూ కలిసికట్టుగా ఉంటూ రిజర్వేషన్లతో పాటు అన్ని హక్కులు సాధించుకోవాలన్నారు.

  • Related Posts

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర