వానోస్తే కష్టమే.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరంలో వానొస్తే కష్టమవుతోంది. టౌన్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మెయిన్ రోడ్లు, కాలనీల్లో సరైన డ్రైనేజీలు లేక వానలు కురిస్తే వరదనీళ్లు రోడ్లపైనే నిలుస్తున్నాయి.పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇండ్ల మధ్య వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు కురిసినప్పుడల్లా నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లతో పాటు, పలు కాలనీల్లో రోడ్లు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి.టౌన్లో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. అందుకనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటా సుమారు లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నా, ప్లానింగ్, పర్యవేక్షణ లేక పనులు పూర్తయిన మున్నాళ్లకే అవి శిథిలమవుతున్నాయి. మున్సిపాలిటీలో సుమారు 23 వేలు జనాభా నివసిస్తుండగా, నిత్యం వివిధ అవసరాల నిమిత్తం మరో 10 వేలకు పైగా జనం వచ్చిపోతుంటారు. బస్టాండ్ నుంచి బాలాజీ చౌక్, నర్సీపట్నం రోడ్డు, కాలేజీ రోడ్, ఎర్రవరం రోడ్డు, ఈ ఏరియాలో వ్యాపార సంస్థలు అధికంగా ఉంటాయి. ఏలేశ్వరం కి రాకపోకలకు ఈ రోడ్లుప్రధానమైనవి. ఈ ఏరియాల్లో చిన్నపాటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అది కూడా మూసుకుపోయింది. రోడ్కు రెండు పక్కల పెద్ద డ్రైనేజీతో పాటు, వీధుల్లో కాలవల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీసేందుకు పనులు చేస్తున్నారు. పనులు ప్రారంభించి సుమారు 15 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ కంప్లీట్గా అవలేదు. ఏలేశ్వరం లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రతీ వానాకాలంలో వరద నీరు రోడ్పై నిలిచి ఇబ్బందులు పడుతున్నా, అధికారులు మాత్రం నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏలేశ్వరం ఈ రోడ్డుపై. నిత్యం వేల సంఖ్యలో వెహికల్స్ రాకపోకలు సాగిస్తాయి. రోడ్కు ఇరుపక్కలా దశబ్దాల కింద చిన్న డ్రైనేజీని నిర్మించారు.ప్రస్తుతం అది ముసుకుపోయింది. వానలు కురిస్తే రోడ్పైనే నీళ్లు నిలిచి చిన్నపాటి కుంటలను తలపిస్తాయి. దీంతో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం వచ్చిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్కు రెండు పక్కలా పెద్ద డ్రైనేజీ నిర్మించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.ఇది ఏలేశ్వరం ఎర్రవరం ప్రధాన రహదారి కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజూ వేలల్లో వాహనాలు అటుఇటు తిరుగుతాయి. ఈ రోడ్ లో బాలాజీ చౌక్ లింగవరం కాలనీ వరకు డ్రైనేజీ సరిగా లేదు. వానాకాలంలో రోడ్పైనే నీళ్లు నిలుస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి