

మన న్యూస్ ,సీతారాంపురం, జూన్ 14 :*తల్లికి వందనం.. విద్యార్థులకు వరం.*ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేసిన కూటమి ప్రభుత్వం. *ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం అమలు.*పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ.*భావి తరాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి.*గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ సర్వ నాశనం.*సీతారామ పురం మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్ రాజు.మంచి విద్యాభ్యాసం అందిస్తేనే.. ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారని, అలాంటి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఏ పిల్లవాడూ విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోందని సీతారామ పురం మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్ రాజు అన్నారు. గత పాలనలో పాఠశాల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి.. నేడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. శనివారం ఈ మేరకు సీతారామ పురం టీడీపీ ఆఫీస్ లో తల్లికి వందనం పొందిన లబ్ధిదారులు, వారి పిల్లలతో కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, నిన్న తల్లికి వందనం అమలు చేసి సీఎం చంద్రబాబు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ , లక్షలాది మంది కళ్లలో వెలుగులు నింపారన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద రూ.15 వేలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.2 వేలు మంత్రి నారా లోకేష్ బాబు జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, మరి వైసీపీ పాలనలో రూ.13 వేలు ఇచ్చారని, అంటే రూ.2 వేలు వైసీపీ నాయకుల జేబుల్లోకి పోయాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే పథకాన్ని అమలు చేస్తే… కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు తల్లికి వందనం ఇస్తుందన్నారు. గత ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఒక్క విద్యార్థికే రూ.13వేలు ఇస్తామంటూ ఎన్నికల హామీని ఎగ్గొట్టిందని, కానీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ లబ్ది చేకూరుస్తుంటే వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి చదువుకునేందుకు దోహదపడే విధంగా నేరుగా వారి తల్లి/సంరక్షకుని ఖాతాలో డబ్బులు వేస్తుంటే స్వాగతించకుండా తప్పుడు ప్రచారాలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో ఈ పథకం కోసం కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మేర ఖర్చు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిందన్నారు. విద్యార్ధులకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు, కందిపప్పులో కూడా కమిషన్లు తీసుకున్న చరిత్ర వైసీపీ నాయకులదని సీతారామ పురం మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్ రాజు అన్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి నిధులు ఎప్పుడు పడతాయా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచి చూసేవారని, నేడు పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమయ్యాయంటే విద్యార్ధులపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థమవుతోందన్నారు.త్వరలోనే రైతుల సంక్షేమం కోసం ఏడాదికి 20 వేలు అందించే అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 తేది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 వేల పోస్టులను భర్తీ చేస్తున్నారని, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిడర్లు అందిస్తూ సంక్షేమానికి మళ్లీ ఊపిరి పోశారన్నారు. అన్నక్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపుతున్నారని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ద్వారా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. కూటమి ప్రభుత్వానికి సర్వదా రుణపడి ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంగలశెట్టి వెంకటేశ్వర్లు, సోమనబోయిన రాజశేఖర్, సింగాల నాగేష్ యాదవ్, జాషువా, ఇజ్రాయిల్, గెంటిన శేఖర్, మహా లక్ష్మయ్య, దేవర వెంకటేశ్వర్లు, రమణయ్య, ఆలూరి శ్రీనివాసులు,మరియు మండల నాయకులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు..
