చికిత్సపొందుతూ మూడు నెలల పసిపాప మృతివైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 14: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల: చికిత్స కోసం వెళ్తే మూడు నెలల పసిపాప మృత్యు ఒడిలోకి చేరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట శుక్రవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూర్ మండలం రేవులపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, అశ్విని దంపతుల మూడు నెలల పాపకు జ్వరం కారణంగా ఈ నెల 11న గద్వాల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వెంటనే కర్నూల్లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు రెఫర్ చేసి, వారే అంబులెన్స్ ఏర్పాటుచేసి పంపించారు. అక్కడికి చేరుకోగానే వైద్యులు పరీక్షించి పాప మృతి చెందినట్లు నిర్ధరించారు. అయితే గద్వాల నుంచి వెళ్లేటప్పుడే చిన్నారిలో చలనంలేదని, ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts

ఇరాన్ పై అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ఖండించండి, సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్.

మన న్యూస్,నారాయణ పేట జిల్లా : ఇరాన్ దేశంపై అమెరికన్ సామ్రాజ్యవాదులు చేసిన యుద్ధ దాడిని ప్రపంచ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్ పై అమెరిక, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా…

విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పాఠశాలలో ప్రారంభమై పది రోజులు గడుస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాల అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం కొంకన్వానిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

VRA పెద్ద గురవయ్య మృతి—నివాళులు అర్పిస్తున్న నల్లిపోగు నాగేశం.

VRA పెద్ద గురవయ్య మృతి—నివాళులు అర్పిస్తున్న నల్లిపోగు నాగేశం.

ఇరాన్ పై అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ఖండించండి, సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్.

ఇరాన్ పై అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ఖండించండి, సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్.

డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ—విశ్రాంతి ఉద్యోగుల సంఘం.

డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ—విశ్రాంతి ఉద్యోగుల సంఘం.

విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

నెల్లూరులో వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు

నెల్లూరులో వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు