ఏడాదిలోనే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలకు మంత్రి లోకేష్ నాంది పలికారుమంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

విద్యకే కూటమి ప్రభుత్వం పెద్దపీట

ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం

షైనింగ్ స్టార్స్ అవార్డులతో పేద విద్యార్థులకు ప్రోత్సాహం

సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి

మన న్యూస్ సింగరాయకొండ:-

విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం నాడు సాంఘిక మంత్రి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….. పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం సన్న బియ్యంతో అన్నం పెడతామని చెప్పి పేదల ఆశలకు సున్నం పెట్టారని దుయ్యబట్టారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచారన్నారు. విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పించారని కొనియాడారు. ప్రాథమిక పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు.షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ 20వేల ప్రైజ్ మనీ తో ప్రోత్సహిస్తూ వారిలో సాధించాలనే పట్టుదలను పెంచుతున్నామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..