త్వరలో విపిఆర్ నేత్ర ప్రారంభం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, జూన్ 10:- జిల్లాలో ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- దివ్యాంగులకు సేవ చేయడంలోనే సంతోషం ఉంది- జిల్లాలో ఇప్పటివరకు 950 మందికి ట్రై సైకిళ్ల అందజేతదివ్యాంగులకు సేవ చేయడంలో తమకు ఎంతో సంతోషం ఉంటుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 12 మంది దివ్యాంగులకు విపిఆర్‌ ఫౌండేషన్ తరపున ఎలక్ట్రిక్‌ ట్రై సైకిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మీడియాతో మాట్లాడుతూ….. జిల్లాలో ఇప్పటివరకు 950 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించామని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని వెల్లడించారు. త్వరలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. విపిఆర్‌ నేత్ర అన్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తాను, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎనలేని సంతోషాన్ని పొందుతున్నట్లు పేర్కొన్నారు. నడవలేని దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశి రెడ్డి, ఆవుల వాసు, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..