తాళలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల రిమాండ్ – డీఎస్పీ నల్లపు లింగయ్య

మన న్యూస్,నారాయణపేట జిల్లా:జిల్లా పరిధిలోనీ మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడు తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పి నల్లపు లింగయ్య నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన సుబ్బమ్ విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తేది:11.11.2024 నాడు వివాహానికి హాజరై తిరిగి వచ్చే సరికి ఇల్లు తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది అనే ఫిర్యాదు మేరకు మక్తల్ ఎస్సై కేసు నమోదు చేయగా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో మక్తల్ సీఐ, ఎస్సై క్రైమ్ పార్టీతో దర్యాప్తు ప్రారంభించారు. నారాయణపేట రోడ్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా మక్తల్ పోలీసులు పట్టుకొని విచారించగా వారి పేరు A1 మహమ్మద్ గౌస్ s/o నబీ సబ్, వయస్సు 25 సంలు, నటరాజ్ కాలనీ, సింధనూర్ టౌన్ రాయచూరు, జిల్లా కర్ణాటక రాష్ట్రం. A2 రాయచూర్ హనుమంత s/o ఈశ్వరప్ప వయస్సు 38 సం.లు దేవదుర్గ గ్రామం, రైచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారూ, తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి మొదటగా రక్కీ చేసి తర్వాత దొంగతనాలకు పాల్పడుతుండేవారని వీరు అంతర్రాష్ట్ర నేరస్తులను ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్ లో దొంగతనాలు చేశారని, కర్ణాటక రాష్ట్రంలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారని, అనేక కేసులలో ముద్దాయిలుగా ఉండి జైలు కూడా వెళ్లొచ్చారని వారి వద్ద నుండి 05 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని వాటి విలువ సుమారు 4,50,000/- రూపాయలు ఉంటుందని డిఎస్పి అన్నారు.ఇలా పలు దొంగతనాల కేసులలో దొంగలు ఉన్న వీరిని ఈరోజు రిమాండ్ తరలించడం జరిగిందని డిఎస్పి తెలిపారు. దొంగతనం కేసులను ఛేదించిన వారిలో మక్తల్ సీఐ రామ్లాల్, ఎస్సైలు భాగ్యలక్ష్మి రెడ్డి, SM నవీద్, క్రైమ్ పోలీసులు అశోక్, శ్రీకాంత్, నరేష్, శశి మొదలగు వారిని డీఎస్పీ అభినందించారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు