నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

మన న్యూస్ ,నెల్లూరు:*రాష్ట్ర హోం మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా వెంకట రెడ్డి సేవలను కొనియాడిన మంత్రులు ఆనం, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.*నెల్లూరులో అట్టహాసంగా సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ . *జిల్లాలో సోమశిల, గండిపాలెం, రాళ్లపాడు ప్రాజెక్టులకు ఆద్యుడు వెంకటరెడ్డి.*నాలుగు తరాలుగా ప్రజాసేవలో తరిస్తున్న ఆనం కుటుంబం.*ఆనం కుటుంబంతో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్న మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ, ఎమ్మెల్యేలు, నాటి తరం నేతలు.*వెంకటరెడ్డి జ్ఞాపకార్థం ఆరు వాహనాలను పోలీసులకు అందజేసిన మంత్రులు ఆనం, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి.నెల్లూరు రాజకీయ ముఖచిత్రంలో ఆనం వెంకట్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని, నాలుగు తరాలుగా ప్రజాసేవకు ఆనం కుటుంబం అంకితమవుతూ, ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులో సింహపురి సేవాసమితి ఆధ్వర్యంలో పండుగలా మాజీ మంత్రి దివంగత ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో పండుగ వాతావరణం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలువురు ప్రజా ప్రతినిధులు విచ్చేశారు.ఈ సందర్భంగా తాత ఆనం వెంకటరెడ్డి జీవిత ప్రస్థానాన్ని మనుమరాలు ఆనం కైవల్యా రెడ్డి వివరించారు.అనంతరం ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునఃఆవిష్కరణను, పైలాన్ ను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆనం వెంకటరెడ్డి జీవిత సంగ్రహం పుస్తకాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. తొలి ప్రతిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి మంత్రి నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ…. మహోన్నత వ్యక్తి ఆనం వెంకటరెడ్డి గురించి ఎంతచెప్పినా తక్కువేన్నారు. పేదల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మనిషి ఆనం వెంకటరెడ్డి అని కొనియాడారు. జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మెన్గ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రూపశిల్పి ఆనం వెంకట రెడ్డి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. వీఆర్ కళాశాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి కుటుంబం అన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నీటిప్రాజెక్టులు తెచ్చి జిల్లా రైతులకు ఎనలేని మేలు చేసారని తెలిపారు. ఆనం కుటుంబం నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది తొడలు చరుస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హరనాధపురంలో ఆనం కుటుంబం ఏర్పాటు చేసిన స్కూల్ లో తాను మొదట చదివానన్నారు. ఆ తర్వాత ఆనం కుటుంబ ఆద్వర్యంలోని వీఆర్సీ హైస్కూల్లో చదివానని తెలిపారు. తనకు మొదటి ఉద్యోగం వీఆర్సీ లో ఇచ్చింది ఆనం భక్తవత్సల రెడ్డి అని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆనం కుటుంబంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…. ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ చేసే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తమ కుటుంబానికి ఆనం వెంకన్న బాబుతో సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. విఆర్సీ హై స్కూల్ ని స్థాపించి ప్రారంభించిన ఘనత ఆనం వెంకట రెడ్డికే దక్కుతుందన్నారు.జిల్లాలో సోమశిల, గండిపాలెం, రాళ్లపాడు ప్రాజెక్టులకు ఆద్యుడు వెంకటరెడ్డి అని గుర్తు చేశారు. జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా పోరాడిన ధీశాలి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఈ గొప్ప అవకాశం కల్పించిన ఆనం కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ….నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రంలో తమ తండ్రి ఆనం వెంకటరెడ్డిది చెరగని ముద్ర అన్నారు. మహామహులతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఏసీ సుబ్బారెడ్డి తమ్ముడిగా కాక శిష్యుడిగా పనిచేసారని తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదిగిన కుటుంభం తమదన్నారు. ఏసీ సుబ్బారెడ్డి హయాంలోనే రోడ్ల సౌకర్యం వచ్చిందని గుర్తు చేశారు. అన్నిపార్టీల నేతలతో సఖ్యత కలిగిన ఏకైక వ్యక్తి ఆనం వెంకట రెడ్డి అని కొనియాడారు. అందువల్లే తమకు కూడా అంతటి సఖ్యత ఉండదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక శైలి అని అభినందించారు. సమస్యల పరిష్కారం కోసం కందుకూరు ప్రాంతం నుంచి కూడా ఎడ్లబండ్లపై వచ్చేవాళ్ళమని గుర్తు చేశారు. నాలుగు తరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు. మా పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి, తండ్రి వెంకటరెడ్డి అడుగుజాడల్లో ప్రస్తుతం తాము రాజకీయాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజాసేవే ఆనం కుటుంబం లక్ష్యమన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం లోని ఆరు పోలీస్ స్టేషన్లకు ఆరు వాహనాలు ఆనం వెంకటరెడ్డి జ్ఞాపకార్ధంగా మంత్రి ఆనం ప్రత్యేక చొరవతో దాతలు తాళ్లూరి గిరి నాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, వేలూరు కేశవ చౌదరి, మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, కొండ్రెడ్డి రితీష్ కుమార్ రెడ్డి, హర్షా రెడ్డి సమకూర్చిన ఆరు వాహనాలను ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పోలీస్ స్టేషన్లకు అందజేశారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ కు ఈ వాహనాల తాళాలను మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు అందజేసి జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్, కావలి, ఉదయగిరి, కందుకూరు, గూడూరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి , కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వర రావు, పాశం సునీల్ కుమార్, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ,టిడ్కొ చైర్మన్ అజయ్ కుమార్ , సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ నేత దువ్వూరు రాధాకృష్ణా రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ నేత మాదాల వెంకటేశ్వర్లు, మాజి ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ,ఆనం సోదరులు, కుటుంబసభ్యులు, ఆనం అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర