చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యాధికారిణి దుర్గ భవాని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మాట్లాడుతూ ఉన్ని దుస్తులు ధరించటం ,వేడి చేసిన నీటిని త్రాగటం, ఉదయం ఎండలో నిలబడటం మూలాన చలి నుంచి రక్షించుకోవచ్చు అని అంతేకాకుండా డి విటమిన్ కూడా సమృద్ధిగా లభిస్తుందని అన్నారు. శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, చలి అధికంగా ఉండే సమయాల్లో ప్రయాణాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత మేరకు చలి తీవ్రత ఉండే సమయాల్లో ప్రయాణాలను ఆపుకుంటే మంచిదని తెలిపారు .ప్రతిరోజు వేడి నీటితో రెండుసార్లు స్నానం చేయడం, శరీరానికి కావలసినంత త్రాగునీటిని తీసుకోవాలని తద్వారా డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటామని ,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారాలను తీసుకోవడం మూలాన ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. చల్లటి వాతావరణం మూలాన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం పెరిగే అవకాశాలు ఉంటాయని, శ్వాసకోస వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు తప్పనిసరి అని ,గతంలో జలుబు ,దగ్గు వస్తే ఐదు ఆరు రోజుల్లో తగ్గిపోయేదని కానీ ప్రస్తుత రోజుల్లో వారం లేదా రెండు వారాలు సమయం పడుతుందని అన్నారు. ఆస్తమా ,న్యుమోనియా వంటి వ్యాధులు కలవారు ఈ కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని, తమ ఆరోగ్యం పై అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి అన్ని రకముల పరీక్షలు చేయించుకొని తగు మందులను తీసుకువెళ్లాలని సూచించారు.

  • Related Posts

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.…

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    • By APUROOP
    • April 24, 2025
    • 2 views
    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 6 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు