వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హేమంత్ రెడ్డి గతంలో యువజన విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శిగా, యూనివర్సిటీ అధ్యక్షులుగా గత 11 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు.గతంలో విద్యార్థులు, యువత సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఈయనను రాయలసీమ జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ భాద్యతలు అప్పగించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, యంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, జిల్లాలోని సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటానని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లి, యువతతో కలిసి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డిని జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, పలువురు నాయకులు అభినందించారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి