కూటమి నేతల ఆధ్వర్యంలో తెట్టుగుంటపల్లి గ్రామంలో ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – ప్రజల్లో హర్షం

వెదురుకుప్పం , మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, అలాగే ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో, ఈ రోజు వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి పంచాయతీ తెట్టుగుంటపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంను ఒక్కరోజు ముందుగానే అమలు చేశారు. ఈ కార్యక్రమం కూటమి నాయకుల సమన్వయంతో జరగడం విశేషం. పెన్షన్లు ముందుగా అందడంతో లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, విధవులు ఇలా అనేక లబ్ధిదారులు తమ అభినందనలు తెలిపారు. ఒక లబ్ధిదారుడు మాట్లాడుతూ – “ఇప్పుడే మాకు పెన్షన్ వచ్చింది. మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదొక గొప్ప నిర్ణయం.” అన్నారు. ఈ కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో, స్థానిక నేతల చొరవతో విజయవంతంగా పూర్తయ్యింది. ప్రభుత్వ సంకల్పం, కూటమి నాయకుల సేవా దృక్పథం కలసి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతున్నాయనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ కార్యక్రమంలో గురుసాల కిషన్ చంద్ – నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు , బట్టె చాణిక్య ప్రతాప్ – వాణిజ్య విభాగ అధ్యక్షులు , పాముల శేషాద్రి కుమార్ – బిజెపి ఎస్సీ మోచన్ ప్రధాన కార్యదర్శి , పవన్ & ప్రసాద్ – బూత్ కన్వీనర్లు , సుబ్రహ్మణ్యం – బొమ్మయపల్లి ప్రధాన కార్యదర్శి, ముని వెంకటప్ప, మునిశేఖర్ – గ్రామ నేతలు , యువ నాయకులురెడ్డి కుమార్, నాగార్జున, సురేష్, కరుణ శ్రావణ్, అజిత్ రెడ్డి, మహిళా పోలీస్ శ్వేత, అంగన్వాడి టీచర్ విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..