

మన న్యూస్ ,కావలి:నెల్లూరు జిల్లా ,కావలిలో సినిమా హాల్స్ పై ఆర్డీఓ వంశీకృష్ణ, ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ బుధవారం నాడు తనిఖీలు చేపట్టారు.సినిమా హాల్స్ లో పార్కింగ్ ,ఫుడ్ స్టాల్ల్స్ లో అమ్ముతున్న వాటిపై హాల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ప్రజల వద్ద నుంచి అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖిలలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్,వారి సిబ్బంది ఉన్నారు.

