నాడు ఇచ్చి, నేడు అక్రమణదారులుగా చిత్రీకరిస్తారా

నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు

Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసిపి నాయకులు శ్రీ విగ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ కప్పల చెరువు సమీపంలో జగనన్న కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించి త్వరలో నిర్మాణానికి తోడ్పడుతామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మమ్ములను దొంగలుగా చిత్రీకరించడం ఏమిటంటూ సంఘ నాయకులు ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల వనభోజనాల కార్యక్రమం నిర్వహించి కార్మికులకే కాకుండా గ్రామంలోని ప్రజలకు, పార్టీలకతీతంగా నాయకులకు, పలు సంఘాలకు పిలుపునిచ్చి వన సమారాధన కార్యక్రమం నిర్వహించిన మరుసటిరోజే మాపై వైసిపి నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ వారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అప్పటి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, తదుపరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన వరుపుల సుబ్బారావుల నేతృత్వంలో జరిగిన సభలలో పలుమార్లు జగనన్న కాలనీలో మిగులు భూమిని కమ్యూనిటీ హాల్ కి ఇస్తామంటూ అదే ప్రాంగణంలో మరో సభ పెట్టి కమ్యూనిటీ హాల్ కు స్థలాన్ని కేటాయించినట్లు తెలిపిన కొంతమంది వైసిపి నాయకులు మా సంఘంపై పలువురు అధికారులకు ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదమన్నారు. అలాగే ఆ స్థలంలో భవనాలను కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిన నాయకులు అక్కడ ఎటువంటి కట్టడాలకు సిద్ధమయ్యామో రుజువు చేయాలన్నారు. లేదంటే 15వందల మంది కార్మికుల కుటుంబాలతో సహా ఆరోపణల చేసిన వైసీపీ నాయకుల తీరును ఎండగడుతూ ప్రజా బహుళయంలో నిజ నిర్ధారణకు సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మిక తాపీ పనివార్ల సంఘం అధ్యక్షుడు నందకూరి నాగ శంకర్, కార్యదర్శి పలికల శ్రీను, గౌరవ అధ్యక్షులు కర్రోతు మన్నియ్య, ఎల్లం శెట్టి రాము, బ్రహ్మాడ కొండ బాబు, పతివాడ సత్యనారాయణ, సహాయ అధ్యక్షుడు దనేడి చిన్న, గెద్ద శ్రీను, శిడగం శ్రీను,గెద్ద అప్పన్న, కిలాడి శ్రీను, కాకాడ రాజు,సామన వీరబాబు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.