కడపలో జరిగే మహానాడు పై మంత్రులు పొంగూరు నారాయణ, ఆనంరామనారాయణరెడ్డి సమీక్ష

మన న్యూస్, నెల్లూరు, మే 24: కడపలో ఈనెల 27 నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తున్నారని.. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ వెల్లడించారు. మంత్రి నారాయణ నివాసంలో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారిద్దరు చర్చించుకున్నారు. రాష్ట్ర మహానాడుకు జిల్లా నుంచి 50 వేల మంది తరలి వస్తారని అంచనా వేశారు. అందుకు సంబంధించిన రవాణా సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.. అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను సైతం అద్దెకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మహానాడుకు వచ్చే నేతలు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహిస్తున్నారని.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, టిడిపి నేత బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర