సొసైటీల్లో అందుబాటులో జీలుగ విత్తనాలు.మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూరు సహకార సంఘాల్లో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీ పై జీలుగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ పథకంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూరు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 30 క్వింటాళ్ల చొప్పున జీలుగ విత్తనాలు వచ్చాయన్నారు.ఈ విత్తనాలను 50% రాయితీ పై రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఒక బస్తా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చల్లుకోవాలన్నారు.విత్తనాల కోసం వచ్చే రైతులు తప్పకుండా పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించి సహకార సంఘాల ద్వారా జీలుగ విత్తనాలు పొందాలన్నారు. 30 కిలోల ధర 4275 రూపాయలు ఉంటె రాయితీపై 2137.50 రూపాయలు చెల్లించి ఒక బస్సా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చల్లుకోవచ్చు అని తెలిపారు.

జీలుగ పంట ప్రయోజనాలు
పొలంలో జీలుగను కలియదున్ని తర్వాత అవి నేలకు, ఆపై వేసే పంటలకు విశేషమైన లాభాలు అందిస్తుంది.ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుందిజీలుగ సాగు వల్ల మూడు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. మొక్కలకు రెండు శాతం నత్రజని,సూపర్‌ ఫాస్పేట్‌ను అదనంగా అందిస్తాయి.జింక్‌, మాంగనీసు, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.
నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మార్చుతాయి
నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి.
నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
లెగ్యూ జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లతో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.
తుంగ, గరక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//