జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధీ భవన్ వద్ద జుక్కల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల నిరసన

మన న్యూస్: జుక్కల్ ఎమ్మెల్యే తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బలహీన పడటానికి కారణం అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే పై గాంధీభవన్లో టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేయగా. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరి భార సనాయకులకు, కార్యకర్తలకు పదవులు అంటగడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరసనకు దిగారు.హైదరాబాద్ గాంధీభవన్ లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై జుక్కల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని నియోజకవర్గంలోని ఎనిమిది మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ లో గాంధీభవన్ కి వెళ్లి టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా బిఆర్ఎస్, బిజెపి వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నాడని, సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నామినేటెడ్ పదవులు తన అనుకూలమైన వారికి అంట కడుతున్నారని లక్ష్మీకాంతరావు పై మండిపడ్డారు ఎమ్మెల్యే లక్ష్మి కాంత్రావు ప్రవర్తన మారకుంటే జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని కాంగ్రెస్ నాయకులు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు దృష్టికి తెచ్చారు.. సీనియర్ కాంగ్రెస్ నాయకులను విస్మరిస్తూ తనకు ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు ఆరోపించారు. తక్షణం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సౌ దాగర్ అరవింద్, కమల్ సెట్, వినోద్, సంగమేశ్వర్,జయ ప్రదీప్, అన్ని మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ