

మన న్యూస్ సింగరాయకొండ:-
బుంగబావి పార్కు సమీపంలో వెలిసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పూల మాలలు అలంకరించి, ఆకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం 3 సెక్రటరీ సుశీల మేడమ్, ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు బీసాబత్తిన శ్రీనివాసరావు, గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు బచ్చు కోటేశ్వరరావు, కూనపరెడ్డి శివశంకర్, చుక్క అశోక్ కుమార్, గోరంట్ల బ్రదర్స్, చంద్రమురళి, మధుసూదనరావు, వేణు, మర్రిబోయిన రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గోకరాజు పాపయ్య నాయుడుని ఘనంగా సత్కరించి, ఆలయ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు.