టిడిఆర్ బాండ్ల పేరిట జరిగిన అవినితిపై విచారణ జరపాలి : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిమాండ్

Mana News:- తిరుపతి, నవంబర్ 20, మన న్యూస్:- తిరుమల బాలాజీ నగర్ లో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు స్లాబ్ వేయించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. అసెంబ్లీ లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి హయంలో బాలాజీ నగర్ వాసులకు ఇళ్ల స్లాబ్ వేయిస్తా మని హామీ ఇచ్చి కొన్ని ఇళ్లకు తన హయంలో వేయించారని ఆయన చెప్పారు. బాలాజీ నగర్ లో1136 ఇళ్లు ఉంటే ఇప్పటి వరకు 538 ఇళ్లకు మాత్రమే స్లాబ్ వేశారని మిగిలిన వాటికి స్లాబ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఆయన కోరారు. కాగా తిరుపతివాసులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టిటిడి పాలకమండలి పునరుద్ధరించడం పట్ల సిఎం, డిప్యూటీ సీఎం, టిటిడి చైర్మన్ లకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా శ్రీవారి దర్శన టికెట్స్ అమ్ముకుని స్థానికులకు ఆన్న దర్శన వెసులుబాటును రద్దు చేసిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఫ్లై ఓవర్ పేరు గరుడ వారధిగా తిరిగి పెట్టడం శుభపరిణామం అని ఆయన అన్నారు. కాగా తిరుపతిని గంజాయిరహిత నగరంగా తీర్చిదిద్దతామన్న హామీ పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లని ఆయన కోరారు. గత ప్రభుత్వం లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టిడిఆర్ బాండ్ల జారిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఆయన కోరారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు