విజయవాడ లో డిసెంబర్ 4న ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి

Mana News:- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి విజయవాడ జింఖానా గ్రౌండ్ లో డిసెంబర్ 4న సీపీఐ,(ఎం.ఎల్.) లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయాలని కోరుతూ లిబరేషన్ కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ మండలంలోని భద్రవరం, లింగంపర్తి, ఏలేశ్వరం, ఎర్రవరం, పెద్దనాపల్లి మీదుగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు బుగత బంగార్రాజు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాన్ని విమర్శిస్తూ అందలం ఎక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతాను మూటకట్టుకుందని విమర్శించారు. సూపర్ 6 పేరుతో జనాకర్షక పధకాలను వాగ్దానం చేసిన టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. కార్పొరేట్ బాసుల నమ్మిన బంటు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పేద మద్య తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత అనుభవిస్తున్న వాస్తవ సమస్యలపై ఆరు డిమాండ్లు లేవనెత్తి పీపుల్స్ సిక్స్ పేరుతో లిబరేషన్ ఉద్యమం చేపట్టిందని అన్నారు. ఈఉద్యమంలో భాగంగా చేపట్టనున్న ప్రజా హక్కుల సభను విజయవంతం చేయాలని బుగత బంగార్రాజు కోరారు. ఈర్యాలీలో లిబరేషన్ పొలిట్ బ్యూరో సబ్యులు వి శంఖర్, జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకోండ లచ్చబాబు, ఏఐసిసి టి యు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, నీరుకొండ నాగేశ్వరరావు, నాగమణి, వి రత్నం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..