

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 11- 2 కోట్ల 80 లక్షల వ్యయంతో 33/11సబ్స్టేషన్ మంజూరు చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి ధన్యవాదాలు.- పంచేడులో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో బుచ్చి గ్రామీణ ప్రాంత లోఓల్టేజ్ సమస్యలకు పరిష్కారం. – సోలార్ వినియోగం పై దృష్టి సారించండి. – ఒకసారి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే 20-25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అభివృద్ధి అంటే మాట్లల్లో కాదు చేతల్లో చేసి చూపడమే చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . పంచేడు పంచాయతీలోని మినగల్లు వద్ద 2 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. మాతృభూమి రక్షణలో వీర మరణం పొందిన మురళి నాయక్ మృతికి సంతాప సూచకంగా 2 ఆమె నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆమె మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….. బుచ్చిరెడ్డి పాళెం మండల గ్రామీణ రైతాంగ ప్రయోజనాల కోసం అడిగిన వెంటనే 2 కోట్ల 77 లక్షల వ్యయంతో 33/11సబ్స్టేషన్ మంజూరు చేసిన విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో ఇస్కపాళెం, సాల్మాన్పురం, అన్నారెడ్డి పాళెం గ్రామాల పరిధిలో ఓల్టేజితో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోయే సమస్య వుండదన్నారు. ఓవర్ లోడ్ కారణంగా లో పవర్ ట్రిప్ సమస్యలు తలెత్తవని పంచేడు ప్రాంతంలో ఇకపై నిరంతర త్రీఫేస్ విద్యుత్ సరఫరా వుంటుందన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గంలో ఇది రెండవ సబ్ స్టేషన్ నిర్మాణమన్నారు. సోలార్ వినియోగం పై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు రైతులకు సూచించారు. 2 kW నుంచి 3 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే రూ. 60,000 నుంచి రూ. 78,000 వరకు సబ్సిడీ వస్తుందన్నారు. ఒకసారి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే 20-25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చన్నారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాలకన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే, దాన్ని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి జెన్కో డిఇ రమేష్ చౌదరి, మినగల్లు సర్పంచ్ పూజిత, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి నాయకులు బత్తల హరికృష్ణ, ఏటూరి శివ రామకృష్ణా రెడ్డి, టంగుటూరి మల్లారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
